కోహ్లీకి జరిమానా
ABN , First Publish Date - 2020-09-26T09:09:41+05:30 IST
స్లో ఓవర్ రేట్ కారణంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా విధించారు. గురువారం జరిగిన
దుబాయ్: స్లో ఓవర్ రేట్ కారణంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా విధించారు. గురువారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేయగా, బెంగళూరు బౌలింగ్ నిర్ణీత సమయంలో ముగియలేదు. దీంతో కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించినట్టు ఐపీఎల్ పేర్కొంది. ఈ మ్యాచ్లో కోహ్లీ సేన 97 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.