టీమిండియా వికెట్లు టపటపా.. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ

ABN , First Publish Date - 2022-01-12T01:34:57+05:30 IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాటింగ్ కుప్పకూలింది. 200 పరుగులు కూడా పూర్తికాకముందే

టీమిండియా వికెట్లు టపటపా.. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాటింగ్ కుప్పకూలింది. 200 పరుగులు కూడా పూర్తికాకముందే ఆరు వికెట్లు కోల్పోయింది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి సెషన్‌లో రెండు, తర్వాత సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయిన భారత్ టీ బ్రేక్ త్వాత మరో రెండు వికెట్లను చేజార్జుకుంది.


మార్కో జాన్సెన్, కగిసో రబడ పోటీలు పడి వికెట్లు తీస్తూ భారత బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వకుండా చేస్తున్నారు. మరోవైపు, సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్న కోహ్లీ అర్ధ సెంచరీ తర్వాత కాస్తంత దూకుడు పెంచాడు. సిక్సర్, 11 పోర్లతో 73 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.


శార్దూల్ ఠాకూర్ అతడి తోడుగా ఉన్నాడు. లంచ్ తర్వాత రిషభ్ పంత్ (27), రవిచంద్రన్ అశ్విన్ (2) వికెట్లను భారత్ కోల్పోయింది. టీమిండియా కోల్పోయిన ఆరు వికెట్లలో మూడు జాన్సెన్ దక్కించుకోగా, రబడకు రెండు దక్కాయి.

Updated Date - 2022-01-12T01:34:57+05:30 IST