ఏమైనా తిన్నావా?
ABN , First Publish Date - 2020-10-30T09:29:12+05:30 IST
అమ్మ కాబోతున్న అనుష్కను విరాట్ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మైదానంలో ఉన్నా ఆమె గురించి పట్టించుకుంటూనే ఉన్నాడు.
గ్రౌండ్నుంచే అనుష్కను అడిగిన కోహ్లీ
అబుదాబి: అమ్మ కాబోతున్న అనుష్కను విరాట్ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మైదానంలో ఉన్నా ఆమె గురించి పట్టించుకుంటూనే ఉన్నాడు. ఐపీఎల్లో ఆదివారం చెన్నైతో మ్యాచ్ సందర్భంగా బెంగళూరును ఉత్సాహపరచడానికి అనుష్క స్టేడియానికి వచ్చింది. ఫీల్డ్లో ఉన్న కోహ్లీ.. ఆమెను తిన్నావా? అని సంజ్ఞ చేస్తూ అడిగాడు.. దీనికి భేషుగ్గా.. అన్నట్టుగా అనుష్క థమ్సప్ చెప్పింది. భార్యాభర్తల మధ్య జరిగిన ఈ సంజ్ఞలు.. నెట్టింట్లో వైరల్గా మారాయి.