కొడనాడు కేసులో Jaya Car Driver వద్ద విచారణ
ABN , First Publish Date - 2022-06-30T15:05:47+05:30 IST
కొడైనాడులో జరిగిన హత్య, దోపిడీ వ్యవహారంపై ప్రత్యేక బృందం జయలలిత కారు డ్రైవర్ను బుధవారం విచారించింది. నీలగిరి జిల్లా కొడనాడులో దివంగత మాజీ
ప్యారీస్(చెన్నై), జూన్ 29: కొడైనాడులో జరిగిన హత్య, దోపిడీ వ్యవహారంపై ప్రత్యేక బృందం జయలలిత కారు డ్రైవర్ను బుధవారం విచారించింది. నీలగిరి జిల్లా కొడనాడులో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సొంతమైన ఎస్టేట్ గత 2017లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి వాచ్మెన్ను హత్యచేయడంతో పాటు దోపిడీ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నేపథ్యంలో, కేరళకు చెందిన సయాన్, వాళయార్ మనోజ్ సహా 10 మందిని ఇదివరకే అరెస్ట్ చేశారు. డీఎంకే ప్రభుత్వం గత ఏడాది జూలైలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. విచారణ అధికారిగా కోవై మండల ఐజీ సుధాకర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఇప్పటివరకు 220 మందిని విచారించింంది. ఈ క్రమంలో, మాజీ ముఖ్యమంత్రి జయలలిత కారు డ్రైవర్ కన్నన్ను మంగళవారం విచారించారు.