కొడనాడు కేసు.. Ex mla పీఏ వద్ద విచారణ

ABN , First Publish Date - 2022-05-03T15:58:30+05:30 IST

నీలగిరి జిల్లాలోని కొడనాడు ఎస్టేట్‌ దోపిడీ, సెక్యూరిటీ గార్డు హత్య కేసులో అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే పీఏ వద్ద ప్రత్యేక బృందం మరోమారు విచారణ

కొడనాడు కేసు.. Ex mla పీఏ వద్ద విచారణ

అడయార్‌(చెన్నై): నీలగిరి జిల్లాలోని కొడనాడు ఎస్టేట్‌ దోపిడీ, సెక్యూరిటీ గార్డు హత్య కేసులో అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే పీఏ వద్ద ప్రత్యేక బృందం మరోమారు విచారణ జరిపింది. సోమవారం కోయంబత్తూరులోని పోలీస్‌ శిక్షణా మైదానంలోని విచారణ కేంద్రానికి అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) నారాయణ స్వామి వచ్చారు. అతడిని ఐజీ సుధాకర్‌ బాబు సారథ్యంలోని బృందం ఉదయం 11 గంటల నుంచి విచారణ మొదలుపెట్టింది. ఈయన పది రోజుల క్రితం కూడా ఒకసారి విచారణకు రాగా, మళ్ళీ రెండోసారి విచారణ జరపడం గమనార్హం. కొడనాడు ఎస్టేట్‌ దోపిడీ, సెక్యూరిటీ గార్డు హత్య జరిగిన తర్వాత జయలలిత వద్ద కారు డ్రైవరుగా పనిచేసిన కనకరాజ్‌ రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈయన గతంలో మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి వద్ద పీఏగా కూడా పనిచేశారు. ఈయన చనిపోకముందు నారాయణ స్వామికి పలుమార్లు ఫోన్‌ చేసి మాట్లాడినట్టు నిర్ధారించి నారాయణస్వామిని రెండోసారి విచారించారు. 

Read more