తొలి విడత పోలింగ్‌లో కీలక అభ్యర్థులు వీరే...

ABN , First Publish Date - 2020-10-28T16:36:18+05:30 IST

నితీష్ కుమార్ మంత్రివర్గానికి చెందిన ఆరుగురు మంత్రులు తొలి విడత ఎన్నికల్లో..

తొలి విడత పోలింగ్‌లో కీలక అభ్యర్థులు వీరే...

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ చురుకుగా జరుగుతోంది. 71 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పలువురు కీలక అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించనుండటంతో ఉత్కంఠ నెలకొంది. 114 మంది మహిళలతో సహా మొత్తం 1066 మంది అభ్యర్థులు ఈ విడత ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


నితీష్ కుమార్ మంత్రివర్గానికి చెందిన ఆరుగురు మంత్రులు తొలి విడత ఎన్నికల్లో తలబడుతున్నారు. వీరిలో కృష్ణ నందన్ వర్మ, ప్రేమ్‌కుమార్, జై కుమార్ సింగ్, సంతోష్ కుమార్ నీరల, విజయ్ సిన్హా, రామ్ నారాయణ మండల్ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, హెచ్ఏఎం అధ్యక్షుడు జితిన్ రామ్ మాంఝీ, కామన్‌వెల్త్ షూటర్ శ్రేయసి సింగ్, శత్రుఘ్న సిన్హా కుమారు లవ్ సిన్హా, ప్లూరల్స్ పార్టీ నేత పుష్పం ప్రియ, బీజేపీకి చెందిన ప్రణవ్ కుమార్ యాదవ్, ఆర్జేడీ నుంచి అనంత్ కుమార్ కుమార్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు.

Updated Date - 2020-10-28T16:36:18+05:30 IST