భక్తిశ్రద్ధలతో మిలాద్-ఉన్-నబీ
ABN , First Publish Date - 2020-10-31T06:56:07+05:30 IST
మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుక మిలాద్-ఉన్-నబీని జిల్లాలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
కర్నూలు(కల్చరల్), అక్టోబరు 30: మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుక మిలాద్-ఉన్-నబీని జిల్లాలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. సాధారణంగా సంప్రదాయం ప్రకారం ఊరేగింపు నిర్వహించేవారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మత పెద్దల సూచనల మేరకు ఊరేగింపు రద్దు చేశారు. తమ ఇళ్లలోనే వేడుక జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం మత పెద్దలు ప్రవక్త బోధనలు, శాంతి సందేశాలు ఇచ్చారు.