జిల్లాకు నాలుగు కార్పొరేషన్ చైర్మన్ పదవులు
ABN , First Publish Date - 2020-10-01T08:37:45+05:30 IST
జిల్లాకు వాల్మీకి-బోయ కార్పొరేషన్, కుర్ణి కార్పొరేషన్, వీరశైవ కార్పొరేషన్, బెస్త కార్పొరేషన్ చైర్మన్ పదవులు ప్రభుత్వం దాదాపు ఖరారు చేసింది.
కర్నూలు(ఎడ్యుకేషన్), సెప్టెంబరు 30: జిల్లాకు వాల్మీకి-బోయ కార్పొరేషన్, కుర్ణి కార్పొరేషన్, వీరశైవ కార్పొరేషన్, బెస్త కార్పొరేషన్ చైర్మన్ పదవులు ప్రభుత్వం దాదాపు ఖరారు చేసింది. వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్గా ఆదోనికి చెందిన ఎ.మధుసూదన్, కుర్ణి కార్పొరేషన్కు ఎమ్మిగనూరుకు చెందిన బుట్టా శారదమ్మ, వీరశైవ లింగాయత్ కార్పొరేషన్కు ఎమ్మిగనూరుకు చెందిన రుద్రగౌడు, బెస్త కార్పొరేషన్ చైర్మన్కు కర్నూలు నగరానికి చెందిన తెలుగు సుధారాణి పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.