మళ్లీ చంద్రబాబే సీఎం
ABN , First Publish Date - 2020-09-29T10:59:46+05:30 IST
మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కోరారు.
టీడీపీ నంద్యాల లోక్సభ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
కర్నూలు(అగ్రికల్చర్), సెప్టెంబరు 28: మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కోరారు. ఉలిందకొండ, కల్లూరు, తదితర గ్రామాలనుంచి పార్టీ నాయకులు, అభిమానులు పూలమాలలు, బొకేలతో సోమవారం గౌరు వెంకటరెడ్డిని కల్లూరులోని ఆయన స్వగృహంలో సన్మానించారు. ఆయన కేక్ కట్ చేశారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో తనకు ఈ పదవిని అప్పగించిన చంద్రబాబు నాయుడుని నమ్మకాన్ని నిలబెడతానన్నారు.
పార్టీ కోసం రేయింబవళ్లు కృషి చేస్తానని, పార్టీ కార్యకర్తలు, నాయకులు తనకు అండగా నిలవాలని కోరారు. వార్డు స్థాయి నుంచి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారమయ్యేలా పోరాడదామని పిలుపునిచ్చారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేవలం ఏడాదిన్నర పరిపాలనలోనే ప్రజల నుంచి చీత్కారం పొందారని అన్నారు. కార్యక్రమంలో ఉలిందకొండ మాజీ సర్పంచ్ పరమేష్, కమల్, మాజీ ఎంపీటీసీ మద్దిలేటి, శ్రీనివాసులు, మురళి, రమణ, ప్రసాద్ పాల్గొన్నారు.