డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
ABN , First Publish Date - 2020-09-25T11:42:43+05:30 IST
నగరంలో ఏ.క్యాంపు ఇందిరాగాంధీ స్మారక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో గురువారం 2018 డీఎస్సీలో రెండో జాబితాలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది.
కర్నూలు(ఎడ్యుకేషన్), సెప్టెంబరు 24: నగరంలో ఏ.క్యాంపు ఇందిరాగాంధీ స్మారక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో గురువారం 2018 డీఎస్సీలో రెండో జాబితాలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. ఎస్జీటీ 39 మందికి గాను 38 మంది అభ్యర్థులు హాజరై సర్టిఫికెట్లను వెరిఫై చేయించుకున్నారు. ఒక అభ్యర్థి సర్టిఫికెట్ల పరిశీలనకు గైర్హాజరయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తియిన అభ్యర్థులకు క్రమ సంఖ్య 1 నుంచి 150 వరకు ఉన్న అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఈవో సాయిరాం తెలిపారు. కర్నూలు డిప్యూటీ డీఈవో అనూరాధ, నాగరాజునాయుడు, కార్యాలయ ఉద్యోగులు సర్టిఫికెట్లను పరిశీలించిన వారిలో ఉన్నారు.