టీ20 సిరీస్ నుంచి రాహుల్, అక్షర్ పటేల్ అవుట్!
ABN , First Publish Date - 2022-02-12T02:11:29+05:30 IST
వెస్టిండీస్తో త్వరలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ నుంచి వైస్ కెప్టెన్ రాహుల్..
న్యూఢిల్లీ: వెస్టిండీస్తో త్వరలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ దూరమయ్యారు. గాయాల కారణంగా వీరిద్దరూ తప్పుకున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. వీరి స్థానాలను ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్రౌండర్ దీపక్ హుడాలతో భర్తీ చేసినట్టు తెలిపింది. ఐపీఎల్ మెగా వేలం ముగిసిన తర్వాత ఈ నెల 16 నుంచి 20 వరకు టీ20 సిరీస్ జరగనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ దీనికి ఆతిథ్యమిస్తోంది.
వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు దూరమైన కేఎల్ రాహుల్ బుధవారం విండీస్తో జరిగిన రెండో వన్డేలో ఆడాడు. ఇప్పుడు గాయం కారణంగా టీ20 సిరీస్కు దూరమయ్యాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్కు దూరమైన అక్షర్ పటేల్ న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన సిరీస్కు ఎంపికయ్యాడు. ఇప్పుడు విండీస్తో సిరీస్కు దూరమయ్యాడు.
భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా.