కుట్రలకు తెరలేపిన చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-23T05:04:27+05:30 IST

పిఠాపురం, అక్టోబరు 22: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో సీఎం జగన్‌కు, వైసీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త తరహా కుట్రలకు తెరలేపారని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబులు విమర్శించారు. సీ

కుట్రలకు తెరలేపిన చంద్రబాబు
పిఠాపురం దీక్షలో ఎంపీ గీత, ఎమ్మెల్యే దొరబాబు

కాకినాడ ఎంపీ గీత,

పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు 

పిఠాపురం, అక్టోబరు 22: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో సీఎం జగన్‌కు, వైసీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త తరహా కుట్రలకు తెరలేపారని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబులు విమర్శించారు. సీఎంపై టీడీపీ నేతల అనుచిత వాఖ్యలు, చంద్రబాబు కుటిల యత్నాలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్‌లో నిర్వహిస్తున్న జనాగ్రహ దీక్షల రెండో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రతిపక్ష పాత్ర పోషించలేక, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారన్నారు. చంద్రబాబుకు ప్రజలే తగురీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

Updated Date - 2021-10-23T05:04:27+05:30 IST