మ్యాన్హోల్స్ ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2021-04-17T05:53:29+05:30 IST
కార్పొరేషన్ (కాకినాడ), ఏప్రిల్ 16: మేజర్ డ్రైన్లపై సిమెంట్ స్లాబ్ల కారణ ంగా నీటి ప్రవాహం లేక పూడికలు పెరిగిపోతున్నాయనే విషయమై అవసరాన్ని బట్టి నిబంధనల ప్రకారం మ్యాన్హోల్స్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ ఆదేశిం చారు. ఐదో డి
కమిషనర్ స్వప్నిల్ దిన్కర్
కార్పొరేషన్ (కాకినాడ), ఏప్రిల్ 16: మేజర్ డ్రైన్లపై సిమెంట్ స్లాబ్ల కారణ ంగా నీటి ప్రవాహం లేక పూడికలు పెరిగిపోతున్నాయనే విషయమై అవసరాన్ని బట్టి నిబంధనల ప్రకారం మ్యాన్హోల్స్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ ఆదేశిం చారు. ఐదో డివిజన్లో శుక్రవారం ఆయ న పర్యటించారు. ఆ ప్రాంతంలో డ్రైనేజీలు ఊడిక తీయకపోవడం వల్ల నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతోందని, వెంటనే పూడిక తీయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో జేసీబీతో డ్రైనేజీలపై ఉన్న సిమెంట్ స్లాబ్ రాళ్లను తొలగించి పూడిక పనులు ప్రారంభించా రు. కమిషనర్ మాట్లాడుతూ హోటల్ ని ర్వాహకులు, దుకాణదారులు వ్యర్థాలను డ్రైనేజీల్లోకి వదలకుండా బిన్స్ ఏర్పాటు చేసుకుని అందులో వేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని సూచించారు. ప్ర జలు సహకరిస్తేనే డ్రైనేజీల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా నీటి ప్రవాహం ఉంటు ందన్నారు. మేజర్ డ్రైన్లు స్లాబ్లతో మూసివేయడం వల్ల నీటి ప్రవాహం కఠినం అవడంతోపాటు చెత్త పేరుకుపోతుందన్నారు. దీన్ని తొలగించడానికి కార్మికులకు ఇబ్బందికర పరిస్థితుల్లో 5 నుంచి 10 అడుగుల దూరంలో మ్యాన్హోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈఈ సత్యకుమారి, డీఈ మా ధవి, ఏఈ సత్యనారాయణ పాల్గొన్నారు.