‘వనమాడికి టీడీపీలో సముచిత స్థానం’
ABN , First Publish Date - 2021-01-16T05:32:55+05:30 IST
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), జనవరి 15: తమ నాయకుడు కొండబాబుకు టీడీపీ రాష్ట్రస్థాయి పదవితో సముచిత స్థానం కల్పించిన పార్టీ అధినాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని మత్స్యకార ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), జనవరి 15: తమ నాయకుడు కొండబాబుకు టీడీపీ రాష్ట్రస్థాయి పదవితో సముచిత స్థానం కల్పించిన పార్టీ అధినాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని మత్స్యకార ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును శుక్రవారం ఆయన నివాసంలో వారు సత్కరించారు. మత్స్యకార నాయకులు ఎరుపల్లి రాము, చోడిపల్లి ప్రేమానందం, తిరిది ఎల్లమ్మ, చోడిపల్లి వినాయకుడు కొండబాబుకు శాలువ కప్పి పుష్పగుచ్ఛాలు అందజేయగా ఐక్యవేదిక అధ్యక్షుడు చోడిపల్లి సతీష్ మిఠాయిలు పంచారు. అలాగే 28వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు రెడ్నం సత్తిబాబు, కార్యకర్తలు వనమాడిని సత్కరించారు.