13 ఓటముల తర్వాత..
ABN , First Publish Date - 2020-10-01T09:34:41+05:30 IST
టీ20 ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు చేతిలో 13 వరుస పరాజయాలకు
ఆసీ్సపై గెలిచిన కివీస్ మహిళలు
బ్రిస్బేన్: టీ20 ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు చేతిలో 13 వరుస పరాజయాలకు న్యూజిలాండ్ మహిళల జట్టు బ్రేక్ వేసింది. కంగారూలతో మూడు టీ20ల సిరీ్సలో వరుసగా రెండు ఓటములు చవిచూసిన కివీస్ బృం దం ఆఖరి మ్యాచ్లో గెలిచి పరువు దక్కించుకొంది. బుధవారం జరిగిన మూడో టీ20లో కివీస్ 5 వికెట్లతో నెగ్గింది. తొలుత గార్డ్నర్ (29), కెప్టెన్ లానింగ్ (21) ఆదుకోవడంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 123 పరుగులు చేసింది. ఛేదనలో సాటెర్త్వైట్ (30), కెప్టెన్ సోఫియా (25) రాణించడంతో కివీస్ 19.3 ఓవర్లలో 125/5 స్కోరు చేసి అలవోకగా గెలిచింది.