AP News: కృష్ణా జిల్లాలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటన నేడు
ABN , First Publish Date - 2022-07-31T14:08:19+05:30 IST
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు.
కృష్ణా జిల్లా (Krishna Dist.): కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ రూపకర్త పింగళి వెంకయ్య (Pingali Venkaiah) స్వగ్రామం బట్ల పెనమర్రులో..ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో పాల్గొననున్నారు. కిషన్రెడ్డితోపాటు బీజేపీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
కిషన్ రెడ్డి పర్యటన వివరాలు..
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. 11:15కు ఫోటోగ్రాఫర్స్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:45కు కే.ఎల్ యూనివర్సిటీలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం 4:30కు ఆజాధిక అమృత్ మహోత్సవంలో భాగంగా పింగళి వెంకయ్య స్వగ్రామమైన కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ పయనమవుతారు.