రేపు భీమవరంలో పర్యటించనున్న కిషన్ రెడ్డి
ABN , First Publish Date - 2022-06-12T02:53:14+05:30 IST
అమరావతి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేపు భీమవరంలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో భీమవరం
అమరావతి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేపు భీమవరంలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో భీమవరం చేరుకుంటారు. 10 గంటలకు మోగల్లు చేరుకుని విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళి అర్పించి, అల్లూరి ధ్యాన మందిరాన్ని సందర్శిస్తారు. అనంతరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కళా కేంద్రంలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. జూలై 4న ప్రధాని పాల్గొనే అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలపై అధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పెదఅమిరంలోని గ్రీన్హిల్స్లో మీడియా సమావేశం, అనంతరం బీజేపీ జిల్లా పదాధికారులతో సమావేశమవుతారు. బీజేపీ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొంటారు.