Kishan reddy Tour: గన్నవరం ఎయిర్పోర్టులో కిషన్రెడ్డికి ఘన స్వాగతం
ABN , First Publish Date - 2022-07-31T15:54:32+05:30 IST
గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కిషన్ రెడ్డికి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
కృష్ణా జిల్లా: ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Virarraju), స్థానిక నేతలు, పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి రోడ్డు మార్గాన నేరుగా విజయవాడ (Vijayawada)కు బయలుదేరి వెళ్లారు.
కిషన్ రెడ్డి పర్యటన వివరాలు..
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఉదయం విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. 11:15కు ఫోటోగ్రాఫర్స్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:45కు కే.ఎల్ యూనివర్సిటీలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం 4:30కు ఆజాధిక అమృత్ మహోత్సవం (Azadhika Amrit Mahotsavam)లో భాగంగా పింగళి వెంకయ్య (Pingali Venkaiah) స్వగ్రామమైన కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ పయనమవుతారు.