కేంద్రంపై కేసీఆర్‌ విషప్రచారం: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-04-12T22:09:18+05:30 IST

సీఎం కేసీఆర్ వైఖరి, వితండవాదం, విషప్రచారం చాలా విచిత్రంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

కేంద్రంపై కేసీఆర్‌ విషప్రచారం: కిషన్‌రెడ్డి

ఢిల్లీ:  కేసీఆర్ కుటుంబం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘రైతుల కోసం కాదు..రాజకీయం కోసమే కేసీఆర్‌ ధర్నాలు... ముద్దుల కొడుకు కేటీఆర్ కోసమే కేసీఆర్‌ దీక్షలు.కేసీఆర్ కుటుంబానికి ఒక విధానం, దేశానికి ఒక విధానం ఉండదు.తెలంగాణ రైతుల కోసం కేంద్రం రూ.3400 కోట్లు ఖర్చు చేసింది.ఎరువులపై ఒక్క రూపాయి కూడా పెరగదు. కేంద్రంపై సీఎం కేసీఆర్‌ విషప్రచారం చేస్తున్నారు.వడ్ల విషయంలో లేని సమస్యను ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు.బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చిన మాట నిజంకాదా?.చివరి గింజ వరకు కొంటామని ఇప్పటికే కేంద్రం చెప్పింది.ఉచితంగా ఎరువులిస్తామన్న కేసీఆర్‌.. ఇప్పటికీ ఇవ్వలేదు’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-04-12T22:09:18+05:30 IST