Kishan reddy: టీఆర్‌ఎస్‌ది మాటల ప్రభుత్వమే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-02T20:30:51+05:30 IST

టీఆర్‌ఎస్‌ది మాటల ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

Kishan reddy: టీఆర్‌ఎస్‌ది మాటల ప్రభుత్వమే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

యాదాద్రి (Yadadri): టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan reddy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ది మాటల ప్రభుత్వమేనని, అవినీతికి ప్రతిరూపం టీఆర్‌ఎస్‌ అని అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) అహంకారానికి తెలంగాణ బలవుతోందన్నారు. తెలంగాణను వ్యతిరేకించినవారే.. ఇప్పుడు మంత్రులయ్యారని, తెలంగాణలో సామాజిక న్యాయం (Social justice) లేదని ఆరోపించారు.


ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. కేజీ టు పీజీ (KG to PG), నిరుద్యోగ భృతి (unemployment benefit) ఏమైందో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పథకాలను చూసి మేం నేర్చుకోవాలా?.. కేసీఆర్‌ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఈడీ గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం కేసీఆర్‌కు లేదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-02T20:30:51+05:30 IST