కేసీఆర్‌పై Kishan Reddy విమర్శలు

ABN , First Publish Date - 2022-06-11T21:40:38+05:30 IST

సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబ తాటాకు

కేసీఆర్‌పై Kishan Reddy విమర్శలు

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబ తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. మోదీకి వ్యతిరేకంగా తానే పెద్ద నాయకుడనే భ్రమలో కేసీఆర్‌ ఉన్నారని ఎద్దేవాచేశారు. ఫాంహౌస్‌లో కూర్చొని కేసీఆర్‌ కలలు కంటున్నారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ సరిపోవడం లేదని, దేశాన్ని కూడా పంచుకోవాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2022-06-11T21:40:38+05:30 IST