ఇక్కడ బెంగాల్ రాజకీయాలు పనికి రావు: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-04T00:32:40+05:30 IST

ఇక్కడ బెంగాల్ రాజకీయాలు పనికి రావు: కిషన్‌రెడ్డి

ఇక్కడ బెంగాల్ రాజకీయాలు పనికి రావు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బండి సంజయ్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారపక్షానికి ఓ న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలెవరూ మాస్కులు పెట్టుకోవడం లేదన్నారు. చట్టం కేవలం ప్రతిపక్షాలకే వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. పార్టీలో చర్చించే బండి సంజయ్ జాగరణ దీక్షకు కూర్చున్నారని పేర్కొన్నారు. బీజేపీ దీక్ష చేస్తే టీఆర్ఎస్ ఎందుకు భయపడుతోందన్నారు. పార్టీ కార్యాలయాన్ని బద్దలు కొడతారా?, ఉద్యోగుల కోసం బీజేపీ పోరాడటం తప్పా? అని ప్రశ్నంచారు. చట్టం కొందరికి చుట్టంగా ఉండకూడదని సూచించారు. ఇది తెలంగాణ.. ఇక్కడ బెంగాల్ రాజకీయాలు పనికి రావన్నారు. 

Updated Date - 2022-01-04T00:32:40+05:30 IST