25న ఇందిరా పార్క్ దగ్గర కిసాన్ మహా పంచాయత్
ABN , First Publish Date - 2021-11-24T22:36:32+05:30 IST
నూతన వ్యవసాయ చట్టాల రద్దు, పంటలకు ఎంఎస్పీ ప్రకటించాలని కోరుతూ
ఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల రద్దు, పంటలకు ఎంఎస్పీ ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ హాజరవుతారు. ఈ నెల 26న తెలంగాణ వ్యాప్తంగా రైతులకు మద్దతుగా దీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 28న మహారాష్ట్రలో కిసాన్ మహా పంచాయత్ నిర్వహించనున్నారు.