టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్‌కు దిగనున్న ముంబై ఇండియన్స్

ABN , First Publish Date - 2020-10-02T00:43:35+05:30 IST

ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబిలో జరుగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో...

టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్‌కు దిగనున్న ముంబై ఇండియన్స్

అబుదాబి: ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబిలో జరుగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ జట్టులో మురుగన్ అశ్విన్ స్థానంలో గౌతమ్ ఆడనున్నాడు. ముంబై జట్టులో ఎలాంటి మార్పులు లేవు. పాయింట్ల పట్టికలో పంజాబ్ జట్టు ఐదో స్థానంలో, ముంబై జట్టు ఆరో స్థానంలో ఉండటం గమనార్హం. ఇరు జట్లు చెరో మూడు మ్యాచ్‌లు ఆడి.. చెరో మ్యాచ్‌లో గెలిచాయి.


ముంబై జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా, పొలార్డ్, క్రూనల్ పాండ్యా, పట్టిన్‌సన్, చాహర్, బౌల్ట్, బుమ్రా


పంజాబ్ జట్టు: లోకేష్ రాహుల్(వికెట్ కీపర్/కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, మ్యాక్స్‌వెల్, కరణ్ నాయర్, నీషమ్, సర్ఫరాజ్ ఖాన్, క్రిష్ణప్ప గౌతమ్, మహ్మద్ షమీ, కాట్రెల్, రవి బిష్ణోయ్

Updated Date - 2020-10-02T00:43:35+05:30 IST