కిలో మటన్‌ రూ.50 మాత్రమే..

ABN , First Publish Date - 2021-12-20T13:05:09+05:30 IST

మాంసం ప్రియుల పంట పండింది...

కిలో మటన్‌ రూ.50 మాత్రమే..

చిత్తూరు జిల్లా/పీలేరు : వాల్మీకిపురంలో మాంసం ప్రియుల పంట పండింది. ఆదివారం సాయంత్రం వ్యాపారస్తులు పోటీ పడి తగ్గించడంతో కిలో పొట్టేలు/మేక మాంసం కేవలం రూ.50 వంతున అమ్మకాలు సాగించారు. కొనుగోలుదారులు సైతం పోటీలు పడి ఒక్కొక్కరు ఐదు నుంచి పది కిలోల వరకూ కొన్నారు. గాంధీ బస్టాండు వద్ద ఉన్న ఒక దుకాణదారుడు కిలో రూ.300 బేరం సాగించాడు. దీంతో ఇతర దుకాణదారులు పోటీలు పడి రూ.200లు, రూ.100 అంటూ తగ్గించారు. చివరకు ఒక దుకాణాదారుడైతే కేవలం రూ.50లకు ధర పెట్టాడు. రాత్రి ఏడున్నరకు స్టాకు పూర్తయిపోయింది. దుకాణదారుల పోటీయే ధర తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. కాగా చికెన్‌ మాత్రం కిలో రూ.160 వంతున అమ్మకాలు సాగాయి. ఇదిలా వుండగా వారం పది రోజుల క్రితం కలికిరిలో కిలో మటన్‌ రూ.400లు, చికెన్‌ రూ.160 వంతున విక్రయించారు. ఇప్పటికీ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2021-12-20T13:05:09+05:30 IST