10 సెంట్ల స్థలం కోసం హత్య
ABN , First Publish Date - 2022-07-07T05:57:46+05:30 IST
కేవలం 10 సెంట్ల స్థలం కోసం దాయాదులే చంపేశారు
దాయాదులే నిందితులు
కదిరి, జూలై 6: కేవలం 10 సెంట్ల స్థలం కోసం దాయాదులే చంపేశారు. తలుపుల మండలం బట్రేపల్లి పంచాయతీ పరిధి మూలపల్లికి చెందిన రామ్మోహన (45)ను దాయాదులే బుధవారం బుధవారం హత్య చేశారు. రూరల్ సీఐ శంకర్నాయక్ తెలిపిన వివరాల మేరకు.. రామ్మోహన తండ్రికి ఏడుగురు అన్నదమ్ములు. ఉన్న 14 ఎకరాల ఆస్తిని రెండు రెకరాల చొప్పున పంచుకున్నారు. రామ్మహన ఒక్కడే కుమారుడు. ఇతడి భాగానికి 1.90 ఎకరాల భూమి ఉంది. అతడి దాయాదులు, అన్నదమ్ములైన రామాంజనేయులు, లక్ష్మణ్కు 1.90 ఎకరాల భూమి వచ్చింది. వీరి పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. వాటాల పంపిణీలో రెండెకరాలు రావాల్సిన చోట ఇద్దరికీ పది సొంట్ల చొప్పున తక్కువగా వచ్చింది. ఈ విషయమై వారి మధ్య కొన్నేళ్లుగా వివాదం ఉంది. గ్రామంలోని పెద్దమనుషులు ఇద్దరికీ సర్దిచెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం రామ్మోహనతో రామాంజనేయులు, లక్ష్మణ్ పొలం వద్ద తగాదా పడ్డారు. రామ్మోహనపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు సీఐ వివరించారు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రామ్మోహనకు ఇద్దరు పిల్లలున్నారు. శవాన్ని పోస్టుమార్టంకి తరలించారు.