మహిళను చంపేసి..బస్తాలో మూటగట్టి..
ABN , First Publish Date - 2021-01-21T07:53:56+05:30 IST
ఖమ్మం సమీపంలోని మల్లెమడుగు రైల్వే ట్రాక్ పక్కన.. బస్తాలో మూటకట్టివున్న స్థితిలో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. రైల్వే సిబ్బంది సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలికి 35-40ఏళ్ల
రైల్వేట్రాక్ పక్కన మృతదేహం లభ్యం
ఖమ్మం క్రైం: ఖమ్మం సమీపంలోని మల్లెమడుగు రైల్వే ట్రాక్ పక్కన.. బస్తాలో మూటకట్టివున్న స్థితిలో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. రైల్వే సిబ్బంది సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలికి 35-40ఏళ్ల వయసు ఉంటుందని, రెండు రోజుల క్రితమే మృతిచెంది ఉండొచ్చని భావిస్తున్నారు. దుండగులు హత్యచేసి.. సంచిలో మూటకట్టి మంగళవారం అర్ధరాత్రి సమయంలో రైల్వేట్రాక్ పక్కన పడేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం రెండు భాగాలుగా నరికినట్టు ఉంది. పెదవి తెగిపోయింది. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు సాయంతో ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.