కుందేలును మింగిన కొండచిలువ హతం
ABN , First Publish Date - 2021-06-15T05:04:17+05:30 IST
మందస మండలం లోని అల్లిమెరక కాలనీలో సోమవారం 12 అడుగుల కొండ చిలువను యువకులు హత మార్చారు.
హరిపురం: మందస మండలం లోని అల్లిమెరక కాలనీలో సోమవారం 12 అడుగుల కొండ చిలువను యువకులు హత మార్చారు. ఉదయం కుందే లును మింగిన కొండచిలువ రోడ్డుపైకి రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. యువకులు కొండచిలువను హతమార్చగా, అప్పటికే సగం మింగిన కుందేలు సైతం మృతిచెందింది. దీంతో చుట్టుపక్కల ప్రజలు వీటిని చూసేందుకు తరలివచ్చారు.