కిడ్నాప్ కేసులో 9 మంది అరెస్టు
ABN , First Publish Date - 2020-09-26T20:58:03+05:30 IST
కిడ్నాప్ కేసులో 9 మంది అరెస్టు
ఒంగోలు(క్రైం), సెప్టెంబరు 25: ఒంగోలులో ఈనెల 13న ఒంగోలులో తలకాయాల గొవింద్ను కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ కేవీవీఎన్ ప్రసాద్ తెలిపారు. ఈ కేసులో 15 మం ది నిందితులు ఉండగా, ఒంగోలుకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు తెలిపారు. ఇంకా కడపకు చెందిన ఐదుగురితో పాటు ఒంగోలుకు చెందిన యువకుడుని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.