Hitec City: పూర్తి విద్యుత్ వాహనం ‘ఈవీ 6’ను ప్రదర్శిస్తున్న Kia
ABN , First Publish Date - 2022-05-28T00:11:28+05:30 IST
ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చర్ కియా తన పూర్తి విద్యుత్ వాహనం ‘ఈవీ6’ను ఆవిష్కరించింది. కొండాపూర్లోని
హైదరాబాద్: ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చర్ కియా తన పూర్తి విద్యుత్ వాహనం ‘ఈవీ6’ను ఆవిష్కరించింది. కొండాపూర్లోని ఆటోమోటివ్ కియా, హైటెక్ సిటీ వద్ద దీనిని ప్రదర్శిస్తున్నారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి కేథరిన్, కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్తో కియా ప్రతినిధులు రఘు, గౌతమ్, షోరూం ప్రతినిధులు పాల్గొన్నారు. రూ. 3 లక్షల టోకెన్ మొత్తం చెల్లించడం ద్వారా వాహనాన్ని ముందుగా బుక్ చేసుకోవచ్చని కియా ప్రతినిధులు తెలిపారు. ప్రీమియం ఆఫర్లో భాగంగా 100 మంది వినియోగదారులకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఈవీ6ను డెలివరీ చేయనున్నారు. వచ్చే నెలలో ఈ వాహనాన్ని విడుదల చేయనున్నట్టు కియా తెలిపింది.
ఈవీ6ను ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్ఫాం (E-GMP)పై నిర్మించారు. అత్యంత వేగవంతమైన చార్జింగ్ కలిగిన ఈ వాహనం అసాధారణ పనితీరు కనబరుస్తుంది. ఈవీ 6 ఇండియా వెర్షన్లో 77.4 కిలోవాట్ హవర్ లిథయం అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది 229 పీఎస్ విద్యుత్ శక్తిని 2 డబ్ల్యుూడీలో ఉత్పత్తి చేయడంతో పాటుగా ఏడబ్ల్యుూడీ వేరియంట్లో 325పీఎస్ శక్తిని విడుదల చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 528 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుందని కియో పేర్కొంది.
కియా ఈవీ6లో సౌకర్యవంతమైన ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. వెడల్పాటి ఎలక్ట్రిక్ సన్రూఫ్, డ్రైవర్, ప్యాసెంజర్ రిలాక్సేషన్ సీట్లు, రిమోట్ ఫోల్డింగ్ సీట్లు, ఏఆర్ హెడ్ అప్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. భద్రత పరంగా 8 ఎయిర్బ్యాగ్లు ప్రామాణికంగా దీనిలో ఉన్నాయి. మూన్స్కేప్, స్నో వైట్ పెరల్, రన్వే రెడ్, అరోరా బ్లాక్ పెరల్, యాచ్ బ్లూ వంటి ఐదు రంగుల్లో లభిస్తుంది.