బీజేపీలో చేరిన ఖుష్బూ

ABN , First Publish Date - 2020-10-12T19:47:42+05:30 IST

సినీ నటి ఖుష్బూ సుందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కాషాయం కండువా కప్పుకున్నారు.

బీజేపీలో చేరిన ఖుష్బూ

న్యూఢిల్లీ: సినీ నటి ఖుష్బూ సుందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కాషాయం కండువా కప్పుకున్నారు. సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న సందర్భంగా ఆమెకు రశీదు అందించారు. అంతకుముందు  సీనియర్ నేతలు ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. 


ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. పార్టీలోని ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు నేతలు.. ప్రజలతో సంబంధం లేని వారు పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి వారిని అణచివేస్తున్నారని లేఖలో తెలిపారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, తాను ప్రజల కోసం పనిచేసేందుకు పార్టీలో చేరానే కాని తన పేరు, ప్రతిష్ఠ కోసం కాదని ఖుష్బూ లేఖలో పేర్కొన్నారు. కాని పార్టీలోని కొన్ని శక్తులు తనను అణచివేశాయని ఖుష్బూ ఆరోపించారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఖుష్బూ అన్నారు.  





Updated Date - 2020-10-12T19:47:42+05:30 IST