ద్యూతీకి స్ర్పింట్‌ స్వర్ణం

ABN , First Publish Date - 2020-03-01T09:32:08+05:30 IST

దేశ ‘వేగవంతమైన మహిళ’గా ద్యూతీచంద్‌ తన పాత్రకు న్యాయం చేసింది. ఖేలో యూనివర్సిటీ గేమ్స్‌లో 100 మీ. స్ర్పింట్‌లో స్వర్ణ పతకం గెలుచుకుంది...

ద్యూతీకి స్ర్పింట్‌ స్వర్ణం

భువనేశ్వర్‌: దేశ ‘వేగవంతమైన మహిళ’గా ద్యూతీచంద్‌ తన పాత్రకు న్యాయం చేసింది. ఖేలో యూనివర్సిటీ గేమ్స్‌లో 100 మీ. స్ర్పింట్‌లో స్వర్ణ పతకం గెలుచుకుంది. కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ (కేఐఐటీ) యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ద్యూతీ.. శనివారం జరిగిన పోటీలో 11.49 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. 11.22 సెకన్లతో జాతీయ రికార్డు ద్యూతీ పేరిట ఉంది. కానీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే ఆమె 11.15 సెకన్లలో రేస్‌ను పూర్తి చేయాలి. 

Updated Date - 2020-03-01T09:32:08+05:30 IST