Khammam: యువకులపై రెస్టారెంట్ యజమాని, సిబ్బంది దాడి
ABN , First Publish Date - 2022-03-18T16:38:30+05:30 IST
జిల్లాలోని వైరాలో గల శబరి బార్ అండ్ రెస్టారెంట్లో ఘర్షణ చోటు చేసుకుంది.
ఖమ్మం: జిల్లాలోని వైరాలో గల శబరి బార్ అండ్ రెస్టారెంట్లో ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువకులపై రెస్టారెంట్ యజమాని, సిబ్బంది కర్రలు రాళ్లతో దాడి చేశారు. అర్ధరాత్రి వరకు యజమాన్యం రెస్టారెంట్ నడుపుతున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోని పరిస్థితి. మద్యం మత్తులో ఉన్న యువకులు వద్ద నుంచి పది వేల రూపాయల నగదు, రెండు సెల్ఫ్లోన్లు, బైక్ను రెస్టారెంట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.