Khammam: సొంత గ్రామంలో ఏఆర్ కానిస్టేబుల్ నిశ్చితార్ధం... కానీ అంతలోనే
ABN , First Publish Date - 2022-01-10T18:40:25+05:30 IST
పట్టణంలో ఏఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఓ లాడ్జ్లో ఉరివేసుకుని కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఖమ్మం: పట్టణంలో ఏఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఓ లాడ్జ్లో ఉరివేసుకుని కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అశోక్ కుమార్ 2020లో పోలీస్ ఏఆర్ కానిస్టేబుల్గా నియమితుడయ్యారు. ఆపై కొత్తగూడెం పోలీస్ స్పెషల్ పార్టీలో పని చేశారు. పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియలో భాగంగా ములుగు జిల్లాకు అశోక్ బదిలీ అయ్యారు. ఈ నెల 8న అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఖమ్మం పట్టణంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో కానిస్టేబుల్ రూమ్ తీసుకున్నారు. అయితే రూమ్ క్లీనింగ్ కోసం వచ్చి సిబ్బంది డోర్ కొట్టగా.. ఎంతసేపటికి ఓపెన్ చేయకపోవడంతో పోలీసులకు లాడ్జి యాజమాన్యం సమాచారం అందించింది. పోలీసులు వచ్చి చూడగా ఏఆర్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అశోక్ కుమార్ సొంతగ్రామం సత్తుపల్లి నియోజకవర్గంలోని యజ్ఞనారాయణపురం. ఈరోజు సొంత గ్రామంలో అశోక్ కుమార్ నిశ్చితార్థ కార్యక్రమం ఉంది. అయితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.