క్వారంటైన్‌ కేంద్రం పరిశీలన

ABN , First Publish Date - 2020-03-29T11:46:32+05:30 IST

క్వారంటైన్‌ కేంద్రం పరిశీలన

క్వారంటైన్‌ కేంద్రం పరిశీలన

మణుగూరురూరల్‌, మార్చి 28: మణుగూరు ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన జిల్లా క్వారంటైన్‌ కేంద్రాన్ని శనివారం ప్ర త్యేక అధికారి, ఐఏఎస్‌ అనుదీప్‌ శనివారం పరిశీలించారు. క్వారంటైన్‌ సెంటర్‌ లో పర్యవేక్షణలో ఉన్న ఐదుగురు అనుమానితులు ఇంటికి వెళ్తామని గొడవ చేస్తున్నారని తెలుసుకున్న ఆయన వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోపాటు పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులు, వైద్య బృందంతో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నారాయణమూర్తి, సీఐ షుకూర్‌, వైద్యాధికారిణి మౌనిక సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2020-03-29T11:46:32+05:30 IST