అధిక రేట్లకు అమ్మితే దుకాణాలు సీజ్
ABN , First Publish Date - 2020-03-29T11:52:03+05:30 IST
అధిక రేట్లకు అమ్మితే దుకాణాలు సీజ్
తల్లాడ, మార్చి 28: నిత్యావసర వస్తువులను అధిక రేట్లకు విక్రయిస్తే దుకాణాలు సీజ్చేస్తామని ఎస్ఐ బి.తిరుపతిరెడ్డి హెచ్చరించారు. శనివారం తల్లాడ మండలంలోని అన్నారుగూడెం, నర్సింహారావుపేట తదితర గ్రామాల్లో పలు కిరాణా దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నిత్యావసర సరుకులను విక్రయించాలని సూచించారు. అన్నారుగూడెం కాటన్పార్కులోని కోల్డ్స్టోరేజీలో ట్రాక్టర్లను వరుసక్రమంలో ఉంచాలని అన్నారు.