ఖమ్మం రూరల్లో క్వారంటైన్ కేంద్రం
ABN , First Publish Date - 2020-03-29T11:51:07+05:30 IST
ఖమ్మం రూరల్లో క్వారంటైన్ కేంద్రం
ఖమ్మం రూరల్, మార్చి 28: ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి పరిధిలోని సోషల్వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో కరోనా వైరస్ అనుమానితుల కోసం శనివారం క్వారంటైన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోషల్ వెల్ఫేర్ డీడీ సత్యనారాయణ మాట్లాడుతూ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు 300 బెడ్లతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, కరోనా అనుమానితులను హైదరాబాద్ వరకు తీసుకెళ్లకుండా ఇక్కడే ఉంచే విధంగా కేంద్రాన్ని ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.