TS News.. ఖమ్మం జిల్లా: మధిరలో హిజ్రాల బీభత్సం
ABN , First Publish Date - 2022-09-28T18:38:49+05:30 IST
మధిరలో హిజ్రాలు బీభత్సం సృష్టించారు. వ్యాపారులను బెంబేలెత్తించారు.
ఖమ్మం జిల్లా (Khammam Dist.): మధిరలో హిజ్రాలు బీభత్సం సృష్టించారు. వ్యాపారులను బెంబేలెత్తించారు. విజయకృష్ణ కోల్డ్ స్టోరేజ్లోకి చొరబడిన 20 మందికిపైగా హిజ్రాలు నానా హంగామా సృష్టించారు. అక్కడున్న రైతులపై దాడి చేసి.. నగదు దోచుకున్నారు. స్టోరేజ్లో బట్టలు తీసివేసి పరుగులు పెడుతూ.. భయానక వాతావరణం సృష్టించారు. దసరా పండుగ పేరుతో మామూలు ఇవ్వలేదని అసభ్యకరంగా మాట్టాడుతూ దూషించారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న హిజ్రాల ఆగడాలను పోలీసులు అరికట్టాలని కోరుతున్నారు.