ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం..
ABN , First Publish Date - 2021-07-30T17:54:43+05:30 IST
ఖమ్మం: నగరంలో ఆషాఢం, శ్రావణం ఆఫర్లు ప్రకటించడంతో షాపింగ్ మాల్స్ జనంతో కిటకిటలాడుతున్నాయి.
ఖమ్మం: నగరంలో ఆషాఢం, శ్రావణం ఆఫర్లు ప్రకటించడంతో షాపింగ్ మాల్స్ జనంతో కిటకిటలాడుతున్నాయి. అదే సమయంలో కరోనా నిబంధనలకు ప్రజలు నీళ్లొదిలేస్తున్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ప్రతిరోజు వందలాది పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రితోపాటు ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. జనం విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. కనీసం మాస్క్ కూడా పెట్టుకోవడంలేదు. సామాజికదూరం నిబంధన ఎక్కడా అమలు కావడంలేదు. షాపింగ్ మాల్స్, దుకాణాలు, మార్కెట్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులను పరిమితికి మించి ఎక్కిస్తున్నారు.