పోడు భూముల వార్.. ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత..

ABN , First Publish Date - 2021-07-29T21:57:49+05:30 IST

సత్తుపల్లి మండలంలో పోడు భూముల వ్యవహారం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.

పోడు భూముల వార్.. ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత..

ఖమ్మం జిల్లా: సత్తుపల్లి మండలంలో పోడు భూముల వ్యవహారం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. రేగళ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని పోడు భూముల్లో వ్యవసాయ పనులు ప్రారంభించిన గిరిజనులను ఫారెస్టు సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అటవీ మహిళా సిబ్బందికి గాయాలు అయ్యాయి. గత 20 ఏళ్లుగా పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, ఇప్పుడు ఫారెస్టు అధికారులు తమ వద్ద నుంచి లాక్కోవాలని చూస్తున్నారని గిరిజనులు మండిపడుతున్నారు. మహిళలని కూడా చూడకుండా అటవీ సిబ్బంది తమపై చేయి చేసుకున్నారని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-07-29T21:57:49+05:30 IST