ఖైరతాబాద్, బాలాపూర్ గణపతిలకు తాపేశ్వరం లడ్డూలే
ABN , First Publish Date - 2021-09-17T08:41:40+05:30 IST
తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలో ఉన్న సురుచి ఫుడ్స్ ఖైరతాబాద్ వినాయకుడికి సమర్పించేందుకు 100 కిలోల లడ్డూ తయారు చేసింది.
మండపేట, సెప్టెంబరు 16: తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలో ఉన్న సురుచి ఫుడ్స్ ఖైరతాబాద్ వినాయకుడికి సమర్పించేందుకు 100 కిలోల లడ్డూ తయారు చేసింది. దీనిని గురువారం రాత్రి హైదరాబాద్ తరలించినట్టు ఆ సురుచి సంస్థ పీఆర్వో వర్మ తెలిపారు. శుక్రవారం దీనిని ఆలయ కమిటీ ద్వారా స్వామివారికి సమర్పిస్తామని పేర్కొన్నారు. శనివారం లడ్డూ ప్రసాదాన్ని సురుచి సంస్థ అధినేత పోలిశెట్టి మల్లికార్జునరావు భక్తులకు పంపిణీ చేస్తారు. అదే విధంగా బాలాపూర్ గణపతికి తాపేశ్వరానికే చెందిన హనీ ఫుడ్స్ అధినేత దేవు ఉమామహేశ్వరరావు 15 ఏళ్లుగా లడ్డూ తయారుచేసి సమర్పిస్తున్నారు. ఈ ఏడాది 21 కిలోలతో తిరుమల లడ్డూ మాదిరిగా తయారు చేసి వెండి గిన్నెలో ఉంచి సమర్పించారు.