జీవిత ఖైదీల విడుదలకు జీవో ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-08-10T06:57:35+05:30 IST
అజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా జీవిత ఖైదీల విడుదలకు జీవో ఇవ్వాలని, ఆ జీవో విశాల ధృక్పదంతో ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి జీవిత ఖైదీల విడుదల సాధన సమితి కన్వీనర్ భరద్వాజ విజ్ఞప్తి చేశారు.
- సాధన సమితి అధ్యక్షుడు భరద్వాజ్ విజ్ఞప్తి
ధర్నాచౌక్, ఆగస్టు 9 : అజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా జీవిత ఖైదీల విడుదలకు జీవో ఇవ్వాలని, ఆ జీవో విశాల ధృక్పదంతో ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి జీవిత ఖైదీల విడుదల సాధన సమితి కన్వీనర్ భరద్వాజ విజ్ఞప్తి చేశారు. సాధారణంగా జీవిత ఖైదీల విడుదలకు ప్రభుత్వం జారీచేసే జీవోల్లో ఏడేళ్ల కఠిన శిక్ష రేమిషన్తో కలిసి పదేళ్లు పూర్తి చేసిన ఖైదీలు మాత్రమే అర్హులన్నారు. జీవిత ఖైదీలు చాలా మంది ఆవేశంతో నేరం చేసిన వారే ఉంటారన్నారు. గాంధీనగర్లోని ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. జైళ్లలో 30 ఏళ్ల నుంచి అనేకమంది శిక్ష అనుభవిస్తున్నారన్నారు. చిలకలూరిపేట బస్సు దహనం కేసులో శిక్ష అనుభవిస్తున్న చలపతి, విజయవర్ధన్లు గత 30 ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్నారని వయస్సు రీత్యా ప్రభుత్వం మానవతా ధృక్పదంతో వీరిని విడుదల చేయాలని కోరారు. కోస్తాంధ్ర సమితి అధ్యక్షుడు సర్వేపల్లి సుదర్శన్ పాల్గొన్నారు.