Kabul: పేలుళ్లలో ఐఎస్ఐఎస్-కె హస్తం
ABN , First Publish Date - 2021-08-27T13:57:55+05:30 IST
అఫ్ఘానిస్థాన్ దేశంలోని కాబూల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి, పేలుళ్ల ఘటనకు తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్-కె శుక్రవారం ప్రకటించింది...
కాబూల్ : అఫ్ఘానిస్థాన్ దేశంలోని కాబూల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి, పేలుళ్ల ఘటనకు తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్-కె శుక్రవారం ప్రకటించింది.ఐఎస్ఐఎస్-కె లో ఇతర మిలిటెంట్ గ్రూపులకు చెందిన పాకిస్థానీలు, అఫ్ఘాన్లతో పాటు ఉజ్బెక్ తీవ్రవాదులు కూడా ఉన్నారని వెస్ట్ పాయింట్లోని పోరాట తీవ్రవాద కేంద్రం తెలిపింది.గురువారం కాబూల్లో సంభవించిన నాలుగు పేలుళ్లలో కనీసం 72 మంది మరణించగా,మరో 143 మందికి పైగా గాయపడ్డారు. కాబూల్ విమానాశ్రయంలో రద్దీగా ఉన్న గేట్లను తాకిన ఆత్మాహుతి బాంబర్ చిత్రాన్ని కూడా ఐఎస్ఐఎస్-కె విడుదల చేసింది. దేశం నుంచి పారిపోవాలని తహతహలాడుతున్న అఫ్ఘాన్లకు నిలువరించేందుకు ఈ పేలుళ్లకు పాల్పడ్డారని సమాచారం.
విమానాశ్రయంపై దాడి చేస్తామని ఆత్మాహుతి బాంబులు బెదిరిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని యూఎస్ అధికారులు చెప్పారు.ఐఎస్ఐఎస్-కె ఉగ్రవాద సంస్థ తూర్పు అఫ్ఘానిస్తాన్లో ప్రత్యేకించి నంగాహర్,కునార్ ప్రావిన్సులలో ఉనికిని ఏర్పరచుకుంది. 2016వ సంవత్సరం నుంచి ఆఫ్ఘన్ రాజధానిలో,వెలుపల పలు విధ్వంసకర ఆత్మాహుతి దాడులను నిర్వహించిన ఐఎస్ఐఎస్-కె కాబూల్లో సెల్స్ ఏర్పాటు చేసింది. ప్రారంభంలో పాకిస్థాన్ సరిహద్దులోని కొద్ది ప్రాంతాలకు పరిమితమైన ఈ సంస్థ ఆఫ్ఘాన్ కు విస్తరించింది.కాగా కాబూల్ ఆత్మాహుతి బాంబు దాడి వెనుక ఉన్నవారిని అరెస్టు చేయాలని చైనా పాకిస్థాన్ దేశాన్ని కోరింది.