జల్లుగ్యాంగ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠా కీలక సభ్యుడు అరెస్టు
ABN , First Publish Date - 2022-08-09T04:44:24+05:30 IST
జల్లుగ్యాంగ్ అం తర్రాష్ట్ర దొంగల ముఠా కీలక సభ్యుడు ఉ త్తరప్ర దేశ్ రాష్ట్రం మిరాఠ్కు చెందిన మహమ్మద్ జకీర్ ను అరెస్టు చేసినట్టు నిజామాబాద్ ఏసీపీ వెంక టేశ్వర్ తెలిపారు. జల్లుగ్యాంగ్ అంతర్రాష్ట్ర ఎ నిమిది మంది దొంగల ముఠా సభ్యులు చేస్తున్న దొంగతనాల వివరాలను సోమవారం తన చాం బర్లో విలేకరులకు వెల్లడించారు. నాలుగైదు నె లల క్రితం జక్రాన్పల్లిలో ముఠా సభ్యులు జియో టవర్ వద్ద విలువైన బ్యాటరీలు, దొంగతనం చే శారని తెలిపారు.
ఖిల్లా/జక్రాన్పల్లి, ఆగస్టు8: జల్లుగ్యాంగ్ అం తర్రాష్ట్ర దొంగల ముఠా కీలక సభ్యుడు ఉ త్తరప్ర దేశ్ రాష్ట్రం మిరాఠ్కు చెందిన మహమ్మద్ జకీర్ ను అరెస్టు చేసినట్టు నిజామాబాద్ ఏసీపీ వెంక టేశ్వర్ తెలిపారు. జల్లుగ్యాంగ్ అంతర్రాష్ట్ర ఎ నిమిది మంది దొంగల ముఠా సభ్యులు చేస్తున్న దొంగతనాల వివరాలను సోమవారం తన చాం బర్లో విలేకరులకు వెల్లడించారు. నాలుగైదు నె లల క్రితం జక్రాన్పల్లిలో ముఠా సభ్యులు జియో టవర్ వద్ద విలువైన బ్యాటరీలు, దొంగతనం చే శారని తెలిపారు. జక్రాన్పల్లితో పాటు రాష్ట్రంలో ని ఇతర పోలీసుస్టేషన్లలో దొంగతనాలు చేయడంతో 11 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ముఠాలో కీలక సభ్యుడైన మహమ్మద్ జకీర్, మ రో ఏడుగురు సభ్యులు కలిసి జియో టవర్లకు సంబంధించి బ్యాటరీలు దొంగతనం చేసి పారిపోయినట్లు చెప్పారు. దొంగలు పట్టుకోవడానికి నిజామాబాద్ పోలీసు కమిషనర్ ఆదేశాల మేర కు సీసీఎస్ ఇన్స్పెక్టర్ వై.రాజశేఖర్రెడ్డి, టాస్క్ఫో ర్స్ సీఐ శ్రీధర్, జక్రాన్పల్లి, బాల్కొండ ఎస్సైలు శ్రీకాంత్, గోపి, స్పెషల్టీం కలిసి పక్కా సమాచా రం మేరకు పరారీలో ఉన్న నిందితుడు మహ మ్మద్ జాకీర్ను పట్టుకొని విచారించగా జల్లు గ్యాంగ్గా నిర్ధారించారు. పరారీలో ఉన్న మిగితా జల్లుగ్యాంగ్ సభ్యులు ఉత్తరప్రదేశ్లోని విరాఠ్ జి ల్లా షేక్ర, మురథ్నగర్, దిల్లీలోని శీలంపుర్లోని క్యాంప్ దాంద ప్రాంతాలకు స్పెషల్పార్టీ పోలీసు లను పంపించామని, త్వరలో ఏడుగురు నిందితు లను పట్టుకుంటామని తెలిపారు. ఈ ముఠాలో పరారీలో ఉన్న మహమ్మద్జైద్, నజీం, మహమ్మ అలీ, నయీం, వినాయ్, మహమ్మద్, రషీద్ను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.