ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిన ధర్మాన

ABN , First Publish Date - 2020-07-08T23:56:13+05:30 IST

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటు నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లా

ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిన ధర్మాన

శ్రీకాకుళం: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటు నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లా విభజన సరికాదని తప్పుబట్టారు. శ్రీకాకుళం జిల్లాను విడదీస్తే రాజకీయంగా దెబ్బతింటామని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగిన ప్రతిసారి జిల్లాలను విభజించలేం కదా అని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలను వ్యతిరేకంగా జిల్లాల విభజన చేయటం కష్టమని, ప్రభుత్వ నిర్ణయంతో శ్రీకాకుళం జిల్లా మరింత వెనుకబడిపోతుందని ఆయన చెప్పారు. జిల్లా వాసులంతా శ్రీకాకుళం జిల్లాగానే ఉండాలనుకుంటున్నారని ధర్మాన ప్రసాదరావు తెలిపారు.

Updated Date - 2020-07-08T23:56:13+05:30 IST