డీఎంకే ఎంపీ కుమార్తె వివాహ వేడుకల్లో కేశినేని
ABN , First Publish Date - 2022-03-10T00:41:20+05:30 IST
చెన్నైలో బుధవారం ఉదయం జరిగిన తమిళనాడు డీఎంకే పార్లమెంట్ సభ్యురాలు తమిళచ్చి తంగపాండ్యన్ కుమార్తె వివాహవేడుకల్లో విజయవాడ
చెన్నై: చెన్నైలో బుధవారం ఉదయం జరిగిన తమిళనాడు డీఎంకే పార్లమెంట్ సభ్యురాలు తమిళచ్చి తంగపాండ్యన్ కుమార్తె వివాహవేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రులు దురైమురుగన్, కేఎన్ నెహ్రూ, పెరియసామి, ఈవీ వేలు, తంగం తెన్నరసు, రాజాకన్నప్పన్, ఎంపీలు కనిమొళి, సుప్రియ సులే, ఏ. రాజా పాల్గొన్నారు. వీరందరితోపాటు కేశినేని శ్రీనివాస్ కూడా వధువరూలతో నిలిచి గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన చెన్నైకి చెందిన తెలుగు దేశం నాయకులతో భేటీ అయ్యారు.