రాధా ఆఫీసు దగ్గర ఎవరు రెక్కీ నిర్వహించారో తెలిపిన కేశినేని

ABN , First Publish Date - 2022-01-03T21:57:47+05:30 IST

దేవినేని నెహ్రూ కుటుంబంపై ఎంపీ కేశినేని నాని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఎన్టీఆర్

రాధా ఆఫీసు దగ్గర ఎవరు రెక్కీ నిర్వహించారో తెలిపిన కేశినేని

విజయవాడ: దేవినేని నెహ్రూ కుటుంబంపై ఎంపీ కేశినేని నాని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఎన్టీఆర్, చంద్రబాబు ఎప్పుడూ హత్యారాజకీయాలు ప్రోత్సహించలేదని తెలిపారు. వంగవీటి రాధా, రంగా అనుచరులు స్వార్థ ప్రయోజనాల కోసం.. హత్యారాజకీయాలు చేయడంతో రంగా చనిపోయారని చెప్పారు. టీడీపీ ఆఫీస్‌పై, పట్టాభి ఇంటిపై ఎవరైతే దాడి చేశారో.. వారే రాధా ఆఫీసు దగ్గర రెక్కీ నిర్వహించారని కేశినేని నాని తెలిపారు.


రాధాను చంపడానికి రెక్కీ చేసింది దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు వెంకట సత్యనారాయణ అలియాస్ అరవ సత్యమేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. సత్యంను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఆయనకు బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరారని చెబుతున్నారు. కానీ దీన్ని అరవ సత్యం కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. సత్యంను పోలీసులు తీసుకువెళ్లలేదన్నారు. ఆయన అనారోగ్యకారణంగా ఆస్పత్రిలో చేరారని అతని కుమారుడు చరణ్ తెలిపాడు.

Updated Date - 2022-01-03T21:57:47+05:30 IST