కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌పూరీని కలిసిన కేశినేని నాని

ABN , First Publish Date - 2020-10-28T23:50:30+05:30 IST

కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌పూరీని కలిసిన కేశినేని నాని

కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌పూరీని కలిసిన కేశినేని నాని

ఢిల్లీ: కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌పూరీని టీడీపీ ఎంపీ కేశినేని నాని కలిశారు. స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనుల నిధులు విడుదల చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కేశినేని నాని కోరారు. విజయవాడలో చిన్నపాటి వర్షానికే నీట మునిగే  పరిస్థితి ఉందన్నారు. స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణం కోసం తన అభ్యర్థన మేరకు 2015లో వెంకయ్యనాయుడు రూ.460 కోట్ల నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు.ఆ నిధులతో 2019 వరకు 55 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ నిధుల నుంచి పైసా ఖర్చు పెట్టలేదన్నారు. స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణ పనులను ముందుకు సాగనివ్వడం లేదని పేర్కొన్నారు. మిగిలిన 45 శాతం పనులు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 

Updated Date - 2020-10-28T23:50:30+05:30 IST