పోలవరం నిర్వాసితులకు న్యాయం జరగాలంటే..: కేశినేని నాని
ABN , First Publish Date - 2021-08-04T22:57:29+05:30 IST
పోలవరం నిర్వాసితులకు న్యాయం జరగాలంటే..: కేశినేని నాని
ఢిల్లీ: పోలవరం ప్రోజెక్టు ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు నీరు అందించే ప్రోజెక్టు అని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. రాష్ట్ర విభజనలో పోలవరం జాతీయ ప్రోజెక్టు అని చట్టం చేయడం జరిగిందన్నారు. నిర్వాసితులు ఇల్లు కోల్పోతున్నారని, లక్షల ఎకరాల భూమిని కోల్పోతున్నారని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై బాధ్యత ఉందన్నారు. ఆర్.అండ్.ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మాత్రమే పోలవరం నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని సూచించారు. తాము పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట పోరాటం చేస్తామన్నారు. టీడీపీ ఎప్పుడు కూడా పోలవరం నిర్వాసితుల పక్షణ నిలబడుతామన్నారు. రాష్టంలో కూడా పోలవరం నిర్వాసితుల తరపున కూడా పోరాటం చేస్తామని చెప్పారు.