AP News: ఆ స్టిక్కర్ ఎవరిదో.. ఏంటో.. విచారణలో తేలుతుంది: కేశినేని చిన్ని

ABN , First Publish Date - 2022-07-20T17:23:22+05:30 IST

చిల్లర వివాదంలోకి తన కుటుంబాన్ని లాగడం బాధాకరమని టీడీపీ నేత, కేశినేని చిన్ని అన్నారు.

AP News: ఆ స్టిక్కర్ ఎవరిదో.. ఏంటో.. విచారణలో తేలుతుంది: కేశినేని చిన్ని

విజయవాడ (Vijayawada): ఓ చిల్లర వివాదంలోకి తన కుటుంబాన్ని లాగడం బాధాకరమని టీడీపీ నేత, కేశినేని చిన్ని (శివనాథ్) (Kesineni Chinni) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆ స్టిక్కర్ (Sticker) ఎవరిదో.. ఏంటో.. విచారణలో తేలుతుందన్నారు. హైదరాబాద్‌లో పోలీసులు విచారణ జరిపారని, తన కారు (Car) విషయంలో క్లీన్ చిట్ (Clean chit) ఇచ్చారన్నారు. ప్రస్తుతం తన కారుపై ఎలాంటి స్టిక్కర్ లేదని చెప్పారు. తనపై ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహారమేనని... రాజకీయపరమైనది కాదన్నారు. విజయవాడ, ఆటోనగర్‌లో ఎన్టీఆర్ (NTR) శత జయంతి ఉత్సవం జరపాలని భావించానని, దాన్ని కూడా వివాదాల్లోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ (TDP)లో తానొక సాధారణ కార్యకర్తనని, అధినేత చంద్రబాబు (Chandrababu) ఏం చెప్పినా చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీకి టికెట్ కూడా అడగలేదన్నారు. పార్టీ ఆదేశిస్తే.. కేశినేని నాని గెలుపు కోసం పని చేస్తానని కేశినేని చిన్ని స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-20T17:23:22+05:30 IST